ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి..
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శిoగనమల నియోజకవర్గ మండల కేంద్రంలో నియోజకవర్గ టీడీపీ,జనసేన, బిజెపి పార్టీ ల ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు,ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బండారు శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని బడుగు బలహీన వర్గాలు ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారంటే ఆయన చలవే అని వారు తెలియజేశారు.
ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు అని అన్నారు.న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయ వేత్తగా,సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా,ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ బి అర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బిజెపి నాయకులందరూ పాల్గొన్నారు
Apr 15 2024, 07:22